Home తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏ చేశారు , మా మాట వినలేదు

మొత్తం కేసీఆర్ ఏ చేశారు , మా మాట వినలేదు

303

[vc_row][vc_column]

[/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text css=””]తెలంగాణాలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కి ఆయుధం గా మారి కేసీఆర్ ని గద్దె దించడం లో ముఖ్యపాత్ర పోషించిందని చెప్పాలి

ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భారీ గా అవకతవకలు జరిగాయని దీనిపై సమగ్ర విచారణ జరపడానికి కాళేశ్వరం కమీషన్ చైర్మన్ జస్టిస్ చంద్ర గోష్ నేతృత్వంలో ఒక ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేసి విచారణ జరిపిస్తున్న సంగతి తెలిసిందే

ఈ విచారణలో భాగంగా కొంతమంది ఇంజనీర్ల బృందం తో కలిసి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయం లో కీలకముగా వ్యవహరించిన కొంతమంది ఇరిగేషన్ శాఖకు చెందిన కొంతమంది ని ఈరోజు ( JUNE 15) న విచారించింది

ఈ విచారణ లో కొందరు రిటైర్డ్ ఇంజనీర్లు తాము ఇచ్చిన నివేదికను కెసిఆర్ పట్టించుకోలేదని మేడిగడ్డ బ్యారేజి ని అక్కడే కట్టాలని ఆదేశాలు జారీ చేసారని అప్పటి రిపోర్ట్ ను జస్టిస్ చంద్ర గోష్ కు అందచేశారు , బ్యారేజి ని తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని దానికి సంబందించిన రిపోర్ట్ ను అప్పుడే కెసిఆర్ కు అందజేశామని కానీ ఆయన దానిని పక్కన పెట్టేశారని తెలిపారు.[/vc_column_text][/vc_column][/vc_row]