[vc_row][vc_column]
వివరాలలోకి వెళితే గత ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరపు నుండి మాజీ మంత్రి ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావు ఎన్నికల్లో పోటీ చేసి గెలిలిచిన సంగతి తెలిసిందే , అయితే నామినేషన్ ప్రక్రియ లో భాగంగా తమ ఆస్తుల , అప్పుల వివరాలను ప్రతి అభ్యర్థి విధిగా ఎన్నికల రిటర్న్ అధికారికి అందచేయాలి , ఆ సమయంలో తప్పుడు సమాచారం అందించారని ప్రత్త్యుర్థులు అయిన మహేందర్ రెడ్డి మరియు లగుడిసెట్టి శ్రీనివాసులు కల్వకుంట్ల తారకరామారావు పై హై కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు
కల్వకుంట్ల తారకరామారావు గారు అందించిన నివేదిక లో కేవలం తన పై తన భార్య మరియు తన కూతురు మాత్రమే ఆధారపడి ఉన్నారని తెలియజేసారు , తన కొడుకు హిమాన్షు తన పై ఆధారపడి లేరని తెలియజేసారు
అంతే కాకుండా హిమాన్షు సిద్ధిపేట మర్కూక్ మండలం వెంకటాపూర్లో నాలుగు 4 ఎకరాలు, ఎరబ్రల్లిలో 32.15 ఎకరాలు కొనుగోలు చేసినందుకు రూ.10.50 లక్షలు, రూ.88 15 లక్షలు చెల్లించారని, కేటీఆర్ అర్థిక అండ లేకుండా ఇటీవలే మేజర్ అయిన కొడుకుకు అంత డబ్బు ఎలా వస్తుందన్నారు.
దీనిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని మహేందర్ రెడ్డి మరియు లగుడిసెట్టి శ్రీనివాసులు తరపు న్యాయవాదులు హాయ్ కోర్టు కోర్టుకి విన్నవించుకున్నారు
దీనిపై తదుపరి విచారణను హై కోర్టు మరో నాలుగు వారాల తర్వాత విచారించే విధంగా వాయిదా వేశారు[/vc_column_text][/vc_column][/vc_row]