[vc_row][vc_column]
భారత్ మరియు దక్షిణ ఆఫ్రికా ల మధ్య జరిగిన రెండవ వన్డే మ్యాచ్ బెంగుళూరు లోని చిన్న స్వామి స్టేడియం లో జరిగింది , ఈ మ్యాచ్ లో భారత్ విజయాన్ని చేజిక్కుంచుకుంది , అయితే ఆద్యంతం ఉత్కంఠతో సాగిన మ్యాచ్ లో ప్రత్యర్థులు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు , చివరకు దక్షిణ ఆఫ్రికా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అయితే ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు సెంచరీలు చేయడం అద్భుతం అనే చెప్పాలి , తొలుత బ్యాటింగ్ చేసిన భారత తరపున స్మృతి మంధాన 120 బంతుల్లో 2 సిక్స్ లు , 18ఫోర్లతో 136 పరుగుల చేసి అద్భుత ఇన్నింగ్స్ ని ఆడింది , ఇక మరొక ప్లేయర్ హర్మన్ప్రీత్ కౌర్ కేవలం 88 బంతుల్లో 3 సిక్స్ లు , 9 ఫోర్లతో 103 పరుగులు చేసి శతకాన్ని సాధించింది.
ఇక మేమేం తక్కువ తిన్నామా అనుకున్నారో ఏమో దక్షిణ ఆఫ్రికా జట్టు కూడా వీరబాదుడు బాదారు , ఆ జట్టు కెప్టెన్ అయిన లారా వోల్వార్ట్ 135 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 135 పరుగులు చేసి ఆ జట్టు కి బలాన్ని ఇచ్చింది , అంతే కాకుండా మారిజాన్ క్యాప్ 94 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 114 పరుగులు చేసి తానేమి తక్కువ తినలేదని నిరూపించింది.
అయితే బాగా కష్టపడినప్పటికీ కూడా దక్షిణ ఆఫ్రికా జట్టు విజయాన్ని అందుకోలేక పోయింది.
ఇక ఈ మ్యాచ్ లో మొదట బాటింగ్ చేసిన భారత్ జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల కోల్పోయి 325 పరుగులు చేస్తే , దక్షిణ ఆఫ్రికా జట్టు 50 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి 321 పరుగులు చేసి కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోయింది[/vc_column_text][/vc_column][/vc_row]