Home అంతర్జాతీయo రైతుల ఖాతాల్లో చేరిన 3.5 లక్షల కోట్లు..!

రైతుల ఖాతాల్లో చేరిన 3.5 లక్షల కోట్లు..!

113

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటివరకు దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలకు చేరాయని ఆయన సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. ఈ ప్రయత్నం దేశ రైతులకు బలాన్ని ఇస్తోందని ఆయన అన్నారు. గత పదేళ్లలో, తన ప్రభుత్వం చేసిన కృషి కారణంగా, దేశంలో వ్యవసాయ రంగం వేగంగా అభివృద్ధి చెందిందని ప్రధానమంత్రి కొనియాడారు. లక్షలాది మంది చిన్న, సన్నకారు రైతులకు అందిస్తున్న ఆర్థిక సహాయం కారణంగా, ఇప్పుడు వారికి మార్కెట్ అందుబాటులోకి వచ్చిందని ఆయన అన్నారు. దీనితో పాటు, వ్యవసాయ ఖర్చు తగ్గిందని, వారి ఆదాయం పెంచేందుకు వివిధ పథకాలను ప్రభుత్వం రైతులకు అందిస్తుందని వారు ఈ సందర్బంగా వెల్లడించారు.