[vc_row][vc_column]
[/vc_column][/vc_row][vc_row][vc_column][vc_column_text css=””]విమాన ప్రయాణం అంతే లగ్జరీ గా భావిస్తారు అందరు అంతే కాకుండా జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలి అని అనుకోని వారు లేరు అంతే కాకుండా విమానం టికెట్ ధరకూడా చాలా ఎక్కువే , మరి అంత అధిక ధర పెట్టి టికెట్ కొన్నాక విమానాల్లో ఏసీ వేయకపోతే ??
సరిగ్గా ఇలాంటి సంఘటనే ఢిల్లీ లో జరిగింది ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా వెళ్లే స్పైస్జెట్ ఇండిగో విమానం కొన్ని సాంకేతిక కారణాల వళ్ళ కొన్ని గంటల ఆలస్యంగా బయలుదేరింది , అయితే ఈ గంట పాటు విమానంలో కుర్చీన్న ప్రయాణికులు ఉక్కపోత వల్ల బాగా ఇబ్బంది పడినట్టు X ( ట్విట్టర్ లో ) కొందరు ప్రయాణికులు పోస్ట్ చేశారు. అసలే ప్రయాణం ఆలస్యం పైగా బయట 45 డిగ్రీల ఎండ దానికి తోడు విమానం లోపల కూడా అధిక వేడి ఉంటే కనీసం ఏసీ కూడా వేయలేదని దాదాపు నాలుగు గంటలు వేడి దెబ్బకు నరకం లో ఉన్నట్టుగా ఉందని ప్రయాణికులు వాపోయారు.
దీనిపై ఇండిగో ప్రతినిది వివరణ ఇస్తూ వాతావరణంలో ని అధిక ఉష్ణోగ్రత వలన విమానం కొన్ని సాంకేతిక ఇబ్బందికి గురైందని , ఇటువంటి సంఘటన మరొక సారి పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లను చేస్తామని తెలియజేసారు[/vc_column_text][/vc_column][/vc_row]